గ్రూప్ 1 మెయిన్స్ తిరిగి నిర్వహించండి : సుప్రీం కోర్ట్
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్,ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించింది.మరో సారి మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూలను జరపాలని కమీషన్ ను న్యాయస్థానం ఆదేశించింది.ప్రిలిమ్స్ పరీక్ష లో తప్పుడు సమాధానాలు ఇచ్చిన ఆరు ప్రశ్నలు తొలగించిన మెరిట్ లిస్ట్ రూపొందించాలని న్యాయస్థానం తన ఆదేశాలలో పేర్కొంది.